Gona Ganna Reddy | గోనగన్నారెడ్డి

Gona Ganna Reddy | గోనగన్నారెడ్డి

  • ₹190.00

కాకతీయ చరిత్రాత్మక నవల

నవలాకాల చరిత్ర

శ్రీ శ్రీ రుద్రమదేవి ఆంధ్ర సమ్రాట్టయిన కాకతీయ గణపతి దేవుని కుమార్తె. ప్రపంచచరిత్రలో పైతృకమైన రాజ్యసింహాసనము అధివసించిన రాణులలో మహోత్తమురాలు శ్రీ రుద్రమదేవి. ఉత్తమమైన చరిత్ర, నిర్మల గుణగణాలంకార, శేముషీసంపన్న, నిర్వక్రపరాక్రమధీర ఈ సామ్రాజ్ఞి.

ఆమెకు దక్షిణహస్తంగా మహామాండలికప్రభువు, మహాసేనాధిపతి గోనగన్నారెడ్డి వర్ధమానపురం (నేటి వడ్డమాని) రాజధానిగా పశ్చిమాంధ్ర భూమి ఏలుతూఉండేవాడు. అతని కుమారుడు బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం ద్విపదకావ్యం రచించి ప్రఖ్యాతి పొందాడు.

ఈనాడు ఆంధ్రదేశం అంతా నిండివున్న రెడ్డి, వెలమ, కమ్మ, బలిజ మున్నూరుకాపు మొదలగు ఆంధ్రుల పూర్వీకులు దుర్జయకులజులు న.. ఆంధ్రక్షత్రియజాతికి చెందిన గోన గన్నారెడ్డి మహావీరుడు.


అడివి బాపిరాజు

బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరంలో అక్టోబర్ 8, 1895 న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పనిచేశాడు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకునిగా పనిచేశాడు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.

బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది.

1922లో సహాయ నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను 'తొలకరి' నవలలో పొందుపరచాడు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Gona Ganna Reddy, గోనగన్నారెడ్డి, అడివి బాపిరాజు, Adavi Bapiraju